Tuesday, October 28, 2025
E-PAPER
Homeకరీంనగర్రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎస్పీ మహేష్ బి. గితే

రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎస్పీ మహేష్ బి. గితే

- Advertisement -

అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల

రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా స్వయంగా ఎస్పి రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్వచ్చందంగా యువత ,ప్రజలు,ఆటో డ్రైవర్లు,పోలీస్ అధికారులు, సిబ్బంది సుమారు 460 మంది  రక్తదాన శిబిరంలో పాల్గొనడం అభినందించదగ్గ విషయమని,విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లోను ముందు వరసలో వుంటారని, ముఖ్యంగా రక్తదానంపై వున్న ఆపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు.మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో,ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మధుకర్, నటేష్,ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు, డాక్టర్ సంధ్యారాణి,కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గుడ్లరవి,పెండ్యాల కేశవరెడ్డి, బుస్స ఆంజనేయులు, ప్రయాకర్ రావు వేణు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -