Thursday, June 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కస్తూర్బాలో విద్యార్థులకు రక్త పరీక్షలు

కస్తూర్బాలో విద్యార్థులకు రక్త పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహస్వామి విద్యార్థినులకు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. వర్షాలు ఆరంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రభలేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నారు. విద్యార్థులు తరగతి గదిలో పరిసరాల పరిశుభ్రత పాటించడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని సూచించారు. జ్వరాలు వస్తే వెంటనే స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించాలని, రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు.కీటక జనిత వ్యాధులు, సీజనల్ వ్యాధులు, స్టాప్ డయేరియా గురించి వివరించారు. అనంతరం విద్యాలయంలోని పలువురు విద్యార్థినులకు ల్యాబ్ అసిస్టెంట్ హారిక రక్త పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందుల్ని అందజేశారు.కార్యక్రమంలో సిహెచ్ఓ  రమణ,  హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని గంగమణి, ఏఎన్ఎంలు కృష్ణవేణి, స్వరూప, ఆశా కార్యకర్తలు, విద్యాలయం అధ్యాపక బృందం సభ్యులు, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -