- Advertisement -
హైదరాబాద్ : బ్లూ వాటర్ లాజిస్టిక్ లిమిటెడ్ మే 27 నుంచి ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్కు రానుంది. ఈ ఇష్యూలో ధరల శ్రేణీని రూ.132-135గా ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ కనీస లాట్ సైజ్ను 1000 ఈక్విటీ షేర్లుగా నిర్ణయించింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం మే 26నే ఇష్యూను తెరువనున్నట్టు పేర్కొంది. ఈ ఇష్యూలో ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫాంపై రూ.40.56 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- Advertisement -