నవతెలంగాణ-హైదరాబాద్
సేవాభావంతో కూడిన సామాజిక బాధ్యతను చాటుతూ బీఎన్ఐ ప్లాటినమ్ చాప్టర్, టిఎక్స్ ఆస్పత్రి సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. బుధవారం హాంప్షైర్ ప్లాజా హౌటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఎన్ఐ ప్లాటినమ్ సభ్యులైన వ్యాపార యజమానులు, అలాగే హాంప్షైర్ ప్లాజా హౌటల్ సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన ప్రదీప్ గాంధీ, కె. రుషికేశ్, వి. ప్రణీత్, టిఎక్స్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ వొడ్నాల రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ వొడ్నాల మాట్లాడుతూ ”ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను రక్షి స్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రక్తదానం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలి. అంతేకాక ఈ కార్యక్రమం వ్యాపారవేత్తలు, ఆరోగ్య సంస్థల మధ్య భాగస్వామ్యం ఎంత ప్రజోపయోగంగా ఉంటుందో సూచిస్త్తుంది”.. అని ఆయన అన్నారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తం రోగుల్లో కొత్త ఆశను నింపుతుందని తెలిపారు.
బీఎన్ఐ ప్లాటినమ్ చాప్టర్ , టిఎక్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలోరక్తదాన శిబిరం విజయవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES