కే.కేశవరావుతో డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉన్నత విద్యలోనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ను కొనసాగించాలని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ విద్యా విధాన రూపకల్పన కమిటీ ఛైర్మెన్ కె.కేశవరావుతో చర్చించారు. ఈ సందర్భంగా వారు ఇంటర్మీడియట్ విద్య ఆవిర్భావం, నేటి స్థితిగతులు, విద్యా కమిషన్ రిపోర్ట్, దేశంలో ఏర్పడ్డ విద్యా కమిషన్లు, వాటి సిఫారసులు తదితర విషయాలను చర్చించారు. 1968 కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు జాతీయ విద్యా విధానం ద్వారా 1969లో నాటి కేంద్ర విద్యామంత్రి పి.వి నరసింహారావు సమానత్వం, నాణ్యత, జాతీయ అభివృద్ధి 10 ప్లస్ 2 ప్లస్ 3 విద్యా విధానం అమలు చేశారని గుర్తుచేశారు.
ఉన్నత విద్యలోనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



