- Advertisement -
నవతెలంగాణ – సదాశివపేట
సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో మంగళవారం ప్రచార చివరి రోజున బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోయిని లావణ్య శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్గా పనిచేసిన బోయిని శ్రీనివాస్ పెద్దాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. కె.సి.ఆర్ ప్రభుత్వ కాలంలో గ్రామాలు అభివృద్ధి వేగంగా సాగాయని, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లలోనే గ్రామీణాభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. కావున ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు.
- Advertisement -



