- Advertisement -
- – మండలానికి రెండో మహిళ ఎస్ఐగా బాధ్యతల స్వీకరణ
- నవతెలంగాణ-బెజ్జంకి
- మండల నూతన ఎస్ఐగా బోయిని సౌజన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా శిక్షణ పూర్తి చేసి పూర్తిస్థాయి ఎస్ఐగా సౌజన్య బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన బద్దిపడగ తిరుపతి రెడ్డి సిద్దిపేట ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ యందు సీసీఎస్ విభాగానికి బదిలీపై వెళ్లారు.
- మండలానికి రెండో మహిళ ఎస్ఐగా..
- గతంలో ఎస్ఐగా పని చేసిన ఏబీ దుర్గ మండల ప్రథమ మహిళ ఎస్ఐగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఏబీ దుర్గ సిద్దిపేట మహిళ పోలీస్ స్టేషన్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన బోయిని సౌజన్య మండలానికి రెండో మహిళ ఎస్ఐగా గుర్తింపు పొందనున్నారు.
- Advertisement -