తనిఖీలు.. ఫేక్ కాల్గా గుర్తింపు
నవతెలంగాణ-బేగంపేట్
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. బుధవారం ఉదయం బేగంపేట్ విమానాశ్రయం లో బాంబు ఉన్నట్టు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్, ఈ-మెయిల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది బాంబ్ స్క్వాడ్కు సమాచారం ఇవ్వగా.. వెంటనే పోలీసులు డిజాస్టర్ సిబ్బందితో అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చివరికు విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని.. అది ఫేక్ కాల్గా గుర్తించారు. కాల్ చేసిన నెంబర్ ఆధారంగా ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనంతరం దీనిపై విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగినట్టు సమాచారం.
బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES