చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ నివాసంతో పాటు, రాజ్ భవన్కు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు సీఎం నివాసంతో పాటు రాజ్భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు పేర్కొన్నారు. సీఎం ఇంట్లో, రాజ్భవన్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఫేక్ అని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కానప్పటికీ.. అల్వార్ పేట్లోని సీఎం నివాసంతో పాటు, గవర్నర్ నివాసం రాజ్ భవన్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బెదిరింపు ఫోన్స్ కాల్స్ ఎక్కడి నుంచి చేశారు? ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.