అప్రమత్తమైన పోలీసులు
బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు
తిరువనంతపురం: దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు బెదిరింపులు వచ్చాయి. సీఎం అధికారిక నివాసంతోపాటూ పాలయంలో ని ఓ ప్రయివేట్ బ్యాంకు, సీఎం వ్యక్తిగత కార్యదర్శికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. సీఎం నివాసంతోపాటూ, మిగతా రెండు చోట్లా బాంబులు పెట్టినట్టు ఆగంతకులు మెయిల్ పంపించారు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు సోదాలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో రెండు చోట్లా తనిఖీలు చేశారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బెదిరింపు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా ఇంతకుముందు కూడా పలుమార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం విదితమే.



