నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని కృష్ణవేణి హై స్కూల్లో శుక్రవారం బోనాలు ఉత్సాహభరితంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. విద్యార్థులంతా సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పిల్లలు రంగురంగుల ర్యాలీలో బోనం ఎత్తుకొని ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి భక్తితో పూజలు నిర్వహించారు. పండుగ సంబరాల్లో భాగంగా అందమైన నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించారు.
ప్రిన్సిపాల్ టీచర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు ఉత్తేజాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యం మాట్లాడుతూ.. కృష్ణవేణి హై స్కూల్లో మేము విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కూడా విద్యార్థులకు నేర్పిస్తున్నాం. బోనాలు జరుపుకోవడం ద్వారా వారు తమ మాతృసంస్కృతిని అర్థం చేసుకొని భక్తి, ఐక్యత , గౌరవం వంటి విలువలను తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.