- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలం గౌస్ నగర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపధ్యంలో గ్రామ దేవతలైన ఈదమ్మ, నల్ల పోచమ్మ, మారమ్మ దేవతలకు ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పాక వెంకటేశ్ యాదవ్, గ్రామస్తులు నల్ల మాస కుమార్, వడ్డబోయిన పాండు, పాక నర్సింహ, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -