- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
బోనాలు తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని, ఈ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాస్టర్ మైండ్స్ స్కూల్ డైరెక్టర్ వై.వీ.రావు అన్నారు. శనివారం దుబ్బాకలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలకు డైరెక్టర్లు బిట్ల యాదగిరి, దువ్వాళ శ్రీకాంత్ లతో కలిసి ఆయన ముఖ్య అతిథులుగా హాజరైనారు. విద్యార్థుల వేషధారణ, సాంస్కృతిక ప్రదర్శనను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ఎర్రోళ్ల హరిబాబు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -