Friday, May 16, 2025
Homeతెలంగాణ రౌండప్భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి

- Advertisement -

– జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
నవతెలంగాణ- రాయపోల్ : అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతులకు, పట్టేదారులకు మేలు జరిగే విధంగా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకురావడం జరిగిందని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు.బుదవారం రాయపోల్ మండలం ఆరేపల్లి రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం గూర్చి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ముందుగా భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకి భూ భారతి చట్టంలో చక్కటి పరిష్కారం జరుగుతుందన్నారు.ఈ చట్టం పైన గ్రామాల్లో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలనీ తెలిపారు.కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి ఇప్పుడు కబ్జాలో ఉన్న భూములు వారి పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఈ చట్టంలో ఉందన్నారు. కార్యాలయానికి వచ్చిన రైతులకి ఓపికతో సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఇంక చిత్త శుద్ధితో పనిచేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక సంవత్సరం పాటు భూ సమస్యలు, రైతులు పట్టెదార్లు ఎదుర్కున్న విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మేధావులు, ప్రజలు, ఇతలరులందరితో చర్చించి సలహాలు, సూచనలు స్వీకరించి 4 జనవరి 2025 గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, 14 ఏప్రిల్ 2025 న భూ భారతి చట్టం అమలులోకి తెచ్చిందన్నారు.సాదా బైనమాకి సంబంధించి తెల్ల కాగితం మీద కొనుగోలు చేసిన 2014 అంటే రాష్ట్రం ఏర్పడే కంటే ముందు ఒకవేళ అప్పుడు తెల్ల కాగితం మీద కొనుగోలు చేసి ఉండి సన్న, చిన్నకారు రైతులు 12 అక్టోబర్ 2020 నుంచి 10 నవంబర్ 2020 మధ్యలో ఆర్జీ పెట్టుకొని గత 12 సంవత్సరాలు కాస్తూలొ ఉన్నట్లయితే జిల్లా వ్యాప్తంగా సుమారు 44 వేల దరఖాస్తులు ఉన్నాయని తప్పకుండా వాటి మీద కూడా అర్హులు అందరికీ కూడా ప్రాసెస్ చేసి వారందరికీ ఆ భూమి పైన హక్కులు కల్పియాలని కూడా భూభారతి చట్టంలో ఉందన్నారు.ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూమిపై హక్కులు కల్గిన వారు, మోకా మీద లేకుండా కొంత మంది అమ్ముకున్న వారు1977 యాక్ట్ ప్రకారం అసైన్డ్ అమ్మడానికి వీలులేదని, రెగ్యులరైజేషన్ చేసే ఆప్షన్ ఉందన్నారు. అనర్హుల చేతికి వెళితే వారి నుంచి ప్రభుత్వం భూమిని తీసుకుని అర్హులైన వారికి అందివ్వడం జరుగుతుందన్నారు.ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, ఇతరత్రా భూములు ఎవరైనా కబ్జా చేసి ఉంటే వారికి నోటీస్ ఫీల్డ్ వెరిఫై చేసి నిజనిర్ధారణ జరిపి నిర్ణిత కాల వ్యవధిలో ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.వారసత్వ భూములు కుటుంబాలలో కలహాలు జరుగుతాయని అందరి వారసులను నోటిస్ ఇచ్చి పిలిపించి మ్యుటేషన్ పద్ధతిలో నెల రోజులలో పరిష్కారం చేస్తామన్నారు. 

సర్వే నంబర్ రీ సర్వే చెయ్యడానికి సర్వే నంబర్లు ఉన్న భూ యజమానులు అందరిని పిలిపించి అందరూ అమోదం తెలిపి రీ సర్వే నంబర్ ఇవ్వడం జరుగుతుందన్నారు.8 వేల సర్వే, 10 వేల గ్రామ స్థాయిలో పోస్టులు భర్తీ చేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకి పారదర్శకంగా జిల్లా స్థాయిలో అన్ని సమస్యలు పరిష్కారం జరగాలని ఈ చట్టం ప్రవేశపెట్టారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్,తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో బాలయ్య, ఏవో నరేష్, ఎంపీఓ శ్రీనివాస్, ఏఈవోలు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -