- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి ఎద్దడి ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు గత పాలకులు కాలనీ వైపు చూసిన పాపాన పోలేదని స్థానికులు ఆరోపించారు. ఇటీవల సర్పంచిగా గెలిచిన లచ్చే వార్ సుహాసిని అత్యవసర సమస్యను ముందుగా గుర్తించి దానిని పరిష్కరించాలన్న ఉద్దేశంతో గురువారం ఎస్సీ కాలనీ కి వెళ్లి బోర్ డ్రిల్లింగ్ వేయించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. బోరుబావిలో నీరు పుష్కలంగా రావడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె వెంట కారోబార్ మంగురాం, వార్డు సభ్యులు అశోక్, లచ్చే వార్ నితిన్, కాలనీవాసులు పాల్గొన్నారు.
- Advertisement -



