నవతెలంగాణ – జూక్కల్ : మండలంలోని మహ్మదాబాద్ గ్రామానికి గత కొన్ని రోజులుగా నీటి సమస్య ఉంది. దీంతో స్పందించిన జీపీ సక్రెటరీ జీవన్ స్పందించి దాహార్తిని తీర్చడానికి గ్రామపంచాయతీ నిధుల నడి నూతనంగా బోరు మోటారు మంజూరు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి జీవన్ మాట్లాడుతూ .. మమదాబాద్ గ్రామంలోని కాలనీలో గతంలో బోరు వేసి ఉంది. దానిలో మోటారు విద్యుత్ సమస్య వలన కాలిపోవడం జరిగింది. గ్రామపంచాయతీ నిధుల నుండి బోరు మోటారు కొత్తగా కొనుక్కొని మంగళవారం బోరుబావిలోకి దింపి కాలనీవాసుల నీటి సమస్యను తీర్చడం జరిగిందని కార్యదర్శి తెలిపారు. దీంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.
ఫోటో:- నూతన బోరు మోటారు బోరుబావిలోకి దింపుతున్న దృశ్యం.