Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ప్రజల ఖర్చుతో బ్రాహ్మణులకు లాభాలు..

ప్రజల ఖర్చుతో బ్రాహ్మణులకు లాభాలు..

- Advertisement -

– వైట్‌హౌస్‌ వాణిజ్య సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు
వాషింగ్టన్‌ : బ్రాహ్మణులు భారతీయ ప్రజల ఖర్చుతో లాభపడుతున్నారని వైట్‌ హౌస్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవరో పేర్కొన్నారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ”బ్రాహ్మణులు భారతీయ ప్రజల ఖర్చుతో లాభం పొందుతున్నారు. ఇది ఆగాలి” అని అన్నారు. అమెరికా ఆసక్తులకు వ్యతిరేకంగా భారత్‌ వాణిజ్య, భౌగోళిక రాజకీయాలను ప్రోత్సహిస్తుందన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారతదేశం అత్యధిక సుంకాలను వేస్తోందని.. తమ వస్తువులను ఇండియాలో విక్రయించడానికి అనుమతించరన్నారు. భారత ప్రధాని మోడీ గొప్ప నాయకుడు అంటూ.. రష్యా, చైనాతో సన్నిహితంగా ఎందుకు ఉంటున్నారన్నారు. రష్యన్‌ ఆయిల్‌ నుంచి భారతదేశం లాభం పొందుతోందని గతంలోనూ నవరో విమర్శించారు. భారత రిఫైనరీలు తక్కువ ధరకు రష్యన్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసి, యూరప్‌, ఆఫ్రికా, ఆసియాకు ఎగుమతి చేస్తున్నాయన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad