- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక: దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించబడతాయని ఆలయ పూజారి మఠం సిద్దేశ్వర్ స్వామి తెలిపారు. గురువారం వైదిక కార్యక్రమాలతో పాటు శివపార్వతి కల్యాణం, సాయంత్రం బండ్ల బోనాల ఊరేగింపు, రాత్రి అగ్నిగుండం, శుక్రవారం ఉదయం విశ్వనాథుని రథం ఊరేగింపు కార్యక్రమం అనంతరం సాయంత్రం జాతర నిర్వహించబడుతుందని, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
- Advertisement -