భారత్లో పెరుగుతున్న కేసులు
ఒత్తిళ్లు, పోస్ట్-కోవిడ్ ఎఫెక్ట్, వాతావరణ పరిస్థితులు కారణం
మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం
జాగ్రత్త వహించాలంటున్న వైద్యులు
న్యూఢిల్లీ : భారత్లో బ్రెయిన్ ఫాగ్ ఆందోళన కలిగిస్తున్నది. కొన్ని సమయాల్లో మానవుడి మెదడు పనితీరు సరిగ్గా ఉండదు. మందకొడి ఆలోచన, జ్ఞాపక శక్తి తగ్గటం, ఏకాక్రత లోపించటం వంటి సమస్యలు ఉంటాయి. ఈ పరిస్థితి నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. అయితే, ఈ విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తు న్నారు. దేశంలోని బ్రెయిన్ ఫాగ్ కేసులలో పెరుగుదల ఉన్నదని వారు హెచ్చరిసు ్తన్నారు. రోజువారీ జీవన విధానం, ఒత్తిళ్లు, కోవిడ్ అనంతర పరిస్థితులు, వాతావర ణ, హార్మోనల్ ప్రభావం, పోషకాహార లోపం, నిద్రలేమి వంటివి దీనికి కారణా లుగా వైద్యులు, నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య పట్ల అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. మెదడు కొన్ని సమయా ల్లో అలసిపోతుంది. దీంతో దాని పరితీరు పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒకప్పుడు అరుదుగానే ఉండే బ్రెయిన్ ఫాగ్ సమస్య.. ప్రస్తుత ఆధునిక ప్రపం చంలో మారిన మానవుడి జీవన విధాన ం, కరోనా మహమ్మారి అనంతర పరిస్థితు లు, హర్మోన్ల హెచ్చు తగ్గుల ప్రభావంతో పెరిగిపోతున్నదని నిపుణులు చెప్తున్నారు.
దీర్ఘకాలిక ఒత్తిడే ప్రధాన కారణం
దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు బ్రెయిన్ ఫాగ్ సమస్యను ఎదుర్కొంటున్నా రు. అయితే.. దీర్ఘకాలిక ఒత్తిడిని కీలక కారణంగా వైద్యులు, నిపుణులు చెప్తున్నా రు. ఇది.. రక్తపోటు పెరగటం, వ్యాధినిరో ధక శక్తిని తగ్గించేలా చేయటమే కాకుండా మానసిక శక్తిని హరించి వేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి మెదడు అలసిపోతే.. ఆలోచించటం, తర్క, ఏకాగ్రత శక్తి తగ్గి కష్టతరమవుతుందని అంటున్నారు. నిద్రలేమి కూడా మెదడు పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి.. రోజుకు రాత్రిపూట కనీసం 8 నుంచి 9 గంటల నిద్ర అవసరమని చెప్తున్నారు. లేకపోతే.. ఏకాగ్రతశక్తి లోపించటం, మసక ఆలోచనలకు కారణమవుతుందని హెచ్చ రిస్తున్నారు. ఇక వాతావరణ పరిస్థితులు, హర్మోనల్ ప్రభావంతో జ్ఞాపకశక్తిని దెబ్బతీసి.. స్వల్పకాలిక అభిజ్ఞాలోపాలకు దారి తీస్తుందని అంటున్నారు. ఇక కరోనా నుంచి రికవరీ అయిన దాదాపు 25 శాతం నుంచి 30 శాతం మంది ప్రజల్లో పేలవమైన ఏకాగ్రత, మానసిక అలసట వంటి లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా, విటమిన్ బీ12, ఒమెగా-3ఎస్ వంటి కీలక పోషకాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం వంటి పరిస్థితులు మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయని వైద్యులు, నిపుణులు అంటున్నారు.
స్క్రీన్ టైం తగ్గించాలి.. వ్యాయామం అవసరం : వైద్య నిపుణులు
ఈ విషయంలో వైద్యులు, వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి. అంటే.. స్క్రీన్ టైమ్ పరిమితంగా ఉండాలి. వాటికి దూరంగా ఎక్కువ సమయాన్ని గడపాలి. స్థిరమైన, రాత్రిపూట తగినంత మంచి నిద్ర అవసరం. మంచి విటమిన్లు, పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మెదడు పనితీరును మెరుగుపరిచే, ఒత్తిళ్లను దూరం చేసే రోజువారీ వ్యాయామం అవసరం. ఒత్తిడిని నియంత్రించేందుకు మెడిటేషన్, యోగాను అలవర్చుకోవాలి. అవసరమైన సమయాల్లో వైద్యులను కలిసి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి.
బ్రెయిన్ ఫాగ్ ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES