ప్రదర్శనకు 12పైగా ప్రాజెక్టులు
హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ రంగ దిగ్గజం బ్రిగేడ్ గ్రూప్ హైదరాబాద్లో తొలిసారి ఫ్లాగ్షిప్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ ‘బ్రిగేడ్ షోకేస్’ను ఏర్పాటు చేస్తోన్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 22న ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్లోని పార్క్ హయత్లో జరగనున్న ఈ ప్రదర్శనలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, మైసూరు వంటి ప్రధాన నగరాల్లోని 12 కంటే ఎక్కువ ప్రత్యేక ప్రాజెక్టులతో పాటు నాలుగు సరికొత్త లాంచ్లను సంస్థ ప్రదర్శించనున్నట్టు వెల్లడించింది. గృహ కొనుగోలుదారులకు అత్యుత్తమ ఆర్కిటెక్చరల్ ప్రాజెక్టులను నేరుగా చూసే అవకాశం కల్పిస్తూ, ప్రీమియమ్ నివాస స్థలాలను, అధిక విలువ గల పెట్టుబడి అవకాశాలను ఈ వేదిక ద్వారా అందిస్తున్నామని బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ మైసూర్ తెలిపారు. ఇక్కడ గృహాలను బుకింగ్ చేసుకునే వారికి గరిష్టంగా రూ.5 లక్షల విలువైన బంగారం వంటి అద్భుతమైన పరిమిత కాల ఆఫర్లను అందిస్తున్నామన్నారు.
నేడు ‘బ్రిగేడ్ షోకేస్’ ప్రాపర్టీ ఎక్స్పో
- Advertisement -
- Advertisement -



