- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన గురుకులం ఫలితాల్లో మండలం పెద్దతూoడ్ల గ్రామంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థుల హవా కొనసాగింది.విడుదలైన ఫలితాల్లో తమ సత్తాను చాటారు.పాఠశాల నుంచి మొత్తం 18 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా ఇందులో 15 మంది విద్యార్థులు విజయం సాధించి గురుకులం పాఠశాలల్లో సీట్లు పొందారు.విద్యార్థులు సాధించిన ఈ విజయంతో పాఠశాల గౌరవాన్ని పెంచడమే కాకుండా బాధ్యతను మరింతగా పెరిగిందని పాఠశాల కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు అన్నారు.ఇందుకుగాను చిన్నారులను అభినందించి,శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



