- Advertisement -
హైదరాబాద్: అరంగేట్ర ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. జమ్ము కశ్మీర్ వేదికగా జరుగుతున్న పోటీల్లో శనివారం జరిగిన పురుషుల రోయింగ్ కాక్స్లెస్ పెయిర్ ఫైనల్లో తెలంగాణ జోడీ నవదీప్, హర్దీప్సింగ్ 3:20:26 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచారు. మహారాష్ట్ర (3:12:13), మధ్యప్రదేశ్ (3:15:4) రోయర్లు వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఓవరాల్గా ఖేలో ఇండియా వాటర్స్పోర్ట్స్లో మధ్యప్రదేశ్ 18 మెడల్స్తో అగ్రస్థానంలో నిలువుగా.. ఒడిశా, కేరళ టాప్-3లో నిలిచాయి.
- Advertisement -