- Advertisement -
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ – రామారెడ్డి
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం సీట్ నోటీసులు ఇచ్చి కక్ష సాధింపును కొనసాగిస్తున్నారని మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సలవత్ బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు పడిగల శ్రీనివాస్, లింబాద్రి నాయక్, రాజా గౌడ్, సుద్దాల లింగం, రాజేందర్, చందర్ నాయక్, రెడ్డి మల్లేష్, కొత్తోల గంగారం, రాజనర్సు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



