– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక తే ఎజెండా గా రూపొందిన బీఆర్ఎస్ తోనే స్థానిక సంస్థల బలోపేతం, స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ ఛైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగశేషపద్మ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఆయన 8 వ వార్డు తో పాటు పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అశ్వారావుపేట మేజర్ పంచాయతీ అభివృద్ధి చేసింది, మున్సిపాలిటీ గా ఏర్పాటు కు కృషి చేసింది నేనే నాని అయిన అన్నారు.మున్సిపాల్టీ గా మరింత బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాసాని నాగశేషపద్మ – చంద్ర మోహన్ దంపతులు,జెడ్పీటీసీ పూర్వ సభ్యులు జేకేవీ రమణారావు – పద్మజా దంపతులు, మండల పరిషత్ పూర్వ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంక ప్రసాదరావు,పాలవలస జీవన్ రావు,మోటూరు మోహన్, జక్కుల రాంబాబు లు పాల్గొన్నారు.



