- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్టుబడటంతో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారి చేసింది. ఏడు రోజుల్లోగా దీనిపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని తెలిపింది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను సహించబోమని ఈ సందర్భంగా అధిష్టానం స్పష్టమైన సంకేతాలు పంపింది.
- Advertisement -



