- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ నూతన ఎస్సై నవీన్ చంద్రను బీఆర్ఎస్ నాయకులు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ .. మండలంలో మొదటిసారిగా యువ చైతన్యం కలిగిన ఎస్సై రావడం శుభసూచికమని అన్నారు. మండలంలో సమస్యలు ఉంటే తక్షణమే స్పందించి నిరుపేద కుటుంబాలకు ప్రజలకు వారధిగా ఉండాలని మా ఆశయం అని తెలిపారు. అంతకుముందు ఎస్సైని మండల సంప్రదాయంగా శాలువా, గాంధీ టోపీ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నీలు పటేల్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్ , వాస్రే రమేష్, రామ్ రావ్ నాయక్, విట్టు పటేల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -