Monday, June 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టులో చుక్కెదురు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టులో చుక్కెదురు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. తనపై నమోదైన ఒక బెదిరింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కౌశిక్ రెడ్డికి నిరాశే ఎదురైంది. వివరాల్లోకి వెళితే, కమలాపురం మండలం వంగపల్లి గ్రామంలో మనోజ్ అనే వ్యక్తి గ్రానైట్ క్వారీని నిర్వహిస్తున్నారు. అయితే, తమ క్వారీకి సంబంధించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించారంటూ మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో, తనపై నమోదైన ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని అభ్యర్థిస్తూ కౌశిక్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, కౌశిక్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -