Saturday, June 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులుసిరికొండ ప్రశాంత్‌పై కేసు నమోదు

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులుసిరికొండ ప్రశాంత్‌పై కేసు నమోదు

- Advertisement -

– సొంత పూచీకత్తుపై విడుదల
నవతెలంగాణ-కాజీపేట

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్‌పై కేసు నమోదైంది. బీఆర్‌ఎస్‌ ఏప్రిల్‌ 27వ తేదీన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ నిర్వహించిన విషయం విదితమే. సభకు భూపాలపల్లి జిల్లా నుంచి వెళ్లే వాహనాలను ఉప్పల్‌ మీదుగా మళ్లించి రైల్వే గేట్‌ వద్ద దాదాపు రెండు గంటలకుపైగా పోలీసులు నిలిపివేసారు. దీంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ఉప్పల్‌ రైల్వే గేట్‌ వద్ద శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కుమారుడు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ప్రశాంత్‌ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇది గమనించిన రైల్వే అధికారులు రైలుకు సిగల్‌ ఇచ్చి తరలించారు. ఆందోళన చేపట్టినందుకుగాను కాజీపేట రైల్వే పోలీసులు సిరికొండ ప్రశాంత్‌తోపాటు 14 మంది బీఆర్‌ఎస్‌ నాయకులపై శుక్రవారం కేసు నమోదు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
అక్రమ కేసులకు భయపడం : సిరికొండ ప్రశాంత్‌
బీఆర్‌ఎస్‌ పార్టీని అణచివేయాలని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్‌ఎస్‌ నాయకులు సిరికొండ ప్రశాంత్‌ అన్నారు. కాజీపేట ఆర్పీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్కతుర్తిలో రజతోత్సవ సభకు వాహనాలతో వెళుతున్న క్రమంలో ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని రైల్వే గేటు మూసి ఉందని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైలు పట్టాల వద్దకు రాగానే ఆ గేటు మీదుగా రాకపోకలు సాగించే రైళ్లకు అంతరాయం కలిగిందని అన్నారు. దీంతో రైల్వే ఆర్పీఎఫ్‌ పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. వివిధ ప్రాంతాల నుంచి రైల్వే గేట్‌ మీదుగా సభకు వెల్లే వాహనాలు దాదాపు పది కిలోమీటర్ల మేర నిలిచి పోయాయన్నారు. నాయకులు, కార్యకర్తలు వాహనాలు దిగి రైల్వే ట్రాక్‌ దగ్గరకు వచ్చారన్నారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -