- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. మాదాపూర్ యశోద ఆస్పత్రికి ఎదరుగా ఉన్న రోడ్డులో నలుగురు దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అర్ధరాత్రి ఇద్దరు యువకులను బంగారం, డబ్బుల కోసం బెదిరించారు. ఇద్దరు యువకులు ఎదురుతిరగడంతో వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలు అయినవి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -