నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ శివార్లలో ఇంటర్ స్టూడెంట్ శనివారం రాత్రి దారుణ హత్య కు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో వన్ టౌన్, రూరల్ సీఐ లు మోతిరాం, పీఎన్ డీ ప్రసాద్, ఎస్ఐ సైదిరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన మాధగోని సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమారుడు ఈశ్వర్ (18) పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్నాడు. కాగా ఇంటి నుంచి కాలనీ శివారులోని వెళ్లిన ఈశ్వర్ మెడ భాగంలో తీవ్రగాయాలతో మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.
ఇంటర్ స్టూడెంట్ దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES