Sunday, June 22, 2025
E-PAPER
Homeబీజినెస్బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త 5జీ సేవలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త 5జీ సేవలు

- Advertisement -

– సిమ్‌ లేకుండానే 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌
హైదరాబాద్‌ :
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త 5జి ఇంటర్నెట్‌ సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. క్వాంటమ్‌ 5జీ (క్యూ5జి) పేరుతో హైస్పీడ్‌ ఇంటర్నేట్‌ సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు పోటీని ఇవ్వాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా రూ.999కే 100 ఎంబిపిఎస్‌ స్పీడ్‌తో నెట్‌ సేవలను ప్రారంభించింది. ప్రీమియం ప్లాన్‌ రూ.1,499తో 300 ఎంబిపిఎస్‌ సేవలను ఆవిష్కరించింది. దీనికి ఎలాంటి సిమ్‌ కార్డ్‌, వైరింగ్‌ అవసరం లేదని ఆ కంపెనీ వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ క్యూ -5జీ తీసుకున్న వినియోగదారుల ఇండ్లపై సీపీఈ పరికరాలను ఏర్పాటు చేస్తారు. స్పేషల్‌ ఇండోర్‌ రూటర్‌ను ఉపయోగించడం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ టవర్‌ నుంచి సిగల్‌ను అందుకుంటుందని తెలిపింది. క్యూ అంటే క్వాంటమ్‌. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ పెద్దగా అందుబాటులో లేని టైర్‌-2, టైర్‌-3 నగరాలను లక్ష్యంగా చేసుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త క్యూ-5జి ఎఫ్‌డబ్ల్యూఏ సేవలను ఆవిష్కరించింది. ఈ సరికొత్త సర్వీస్‌లు వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, నెట్వర్క్‌ లేని నివాస ప్రాంతాలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందించడంలో సహాయపడుతుంది. క్వాంటమ్‌ 5జీ సేవలను ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి బెంగళూరు, పాండిచ్చేరి, విశాఖపట్నం, పూణె, గ్వాలియర్‌, చండీగఢ్‌ వంటి నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -