Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీటీరోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

బీటీరోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రం నుండి మర్రిపల్లి ,రామాపురం చంద్రయన్ పల్లి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని బిజెపి నాయకులు చింతపల్లి కిరణ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకి రోడ్లు గుంతల మయంగా మారడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. చారకొండ మండల కేంద్రం నుండి మర్రిపల్లి వరకు నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేయాలని కోరారు. చారకొండ నుండి రామాపురం చంద్రాయన్ పల్లి రహదారికి నిధులు మంజూరై స్థానిక ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి వంశీకృష్ణ భూమి పూజ నిర్వహించిన ఇప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad