- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని హుస్నాబాద్ గల్లీలో గుర్తు తెలియని దొంగలు పాల గంగాధర్ ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలో పెట్టిన 8 తులాల బంగారు వస్తువులు, వెండి 500 గ్రాములు దొంగిలించుకుని పోయినట్టు స్టేషన్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ సోమవారం తెలిపారు. పట్టణంలోని అవుట్ గల్లీలో ఒక కిరాణా షాపు, మూడు ఇల్లులు తాళాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించినారు. అట్టి ఇళ్లలో ఎటువంటి సొత్తు దొంగతనం కాలేదని తెలిపారు. బాధిత వ్యక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
- Advertisement -



