అవినీతిపై విచారణ జలపాలని వినతి
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పట్టణంలోని 35 వార్డులలో ఇందిరమ్మ కమిటీ పేరుతో కమిటీ సభ్యులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో ప్రిన్సు చౌరస్తాలో ధర్నా చేసి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ .. ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేస్తూ నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా వారి కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,వారికి నచ్చిన వారికి, డబ్బులు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు జాయింట్ కలెక్టర్ కి ఇందిరమ్మ ఇండ్ల లలో జరిగిన అవినీతిని విచారించి పేద ప్రజలకు నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలని కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మాజీ జెడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ, నాయకులు నువ్వుల సత్యనారాయణ, అతికం లక్ష్మీనారాయణ గౌడ్, ఇట్టబోయిన గోపాల్ , అందే శంకర్, కుశంగల రాజు, కడారి వినోద్, ఖాజా అజీముద్దీన్, దిడ్డికాడి భగత్, శ్రీనివాస్, నెలకొండ శివకుమార్, సుభాష్ అంజద్ పెంట నితీష్ నాగారం సూరజ్, యాస సంతోష్ సైదులు, ఇస్మాయిల్, ముజీబ్,అమీర్, శ్రీను, నరసింహ, గుర్రాల శ్రీశైలం పాల్గొన్నారు.