- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బస్సు కిటికీలు, తలుపుల గుండా బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరిని RIMS ఆదిలాబాద్కు పంపే అవకాశం ఉంది. డ్రైవర్ నిద్రమత్తు లేదా సాంకేతిక లోపమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



