- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ క్యాబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో 2026-27 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
- Advertisement -



