- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’కు వ్యతిరేకంగా ఈ నెల 23వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ నెల 24న భారత్ బంద్కు పిలుపునిస్తూ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చింది. కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు దీనికి మద్దతివ్వాలని కోరింది.
- Advertisement -