– ఇంగ్లాండ్తో టీ20, వన్డే జట్ల ఎంపిక
ముంబయి: భారత మహిళల ఇంగ్లాండ్ పర్యటనకు యువ ఓపెనర్ షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. పేలవ ఫామ్తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన షెఫాలీ వర్మ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచింది. డబ్ల్యూపీఎల్ మెరుపులతో టీ20 జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ.. వన్డే జట్టులో మాత్రం తిరిగి చోటు సాధించలేదు. జూన్ 25 నుంచి ఆరంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనలో భారత మహిళల జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ జులై 12న ముగియనుండగా.. వన్డే సిరీస్ జులై 16 నుంచి షురూ కానుంది. హర్మన్ప్రీత్ కౌర్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్గా ఎంపిక కాగా.. స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనుంది. ఇటీవల మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో సత్తా చాటిన యువ బ్యాటర్ ప్రతీక రావల్ వన్డే జట్టులో చోటు సుస్థిరం చేసుకుంది. హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి వన్డే, టీ20 జట్లలో చోటు నిలుపుకుంది.
టీ20 జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగస్, రిచా ఘోష్, యస్టికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, సుచి ఉపాధ్మాయ, ఆమన్జోత్ కౌర్, అరుంథత రెడ్డి, క్రాంతి, సయాలి.
వన్డే జట్టు : హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన (వైస్ కెప్టెన్), ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా, రిచా, యస్టికా, తేజల్, దీప్తి శర్మ, స్నేV్ా రానా, శ్రీ చరణి, సుచి, ఆమన్జోత్, అరుంధతి రెడ్డి, క్రాంతి, సయాలి.
షెఫాలీకి పిలుపు
- Advertisement -
- Advertisement -