బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ
నవతెలంగాణ – డిచ్ పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్పల్లి కమాండెంట్ పి. సత్యనారాయణ ఆద్వర్యంలో బెటాలియన్ లోని పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమాన్ని “ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, నిజామాబాద్” బెటాలియన్కు విచ్చేసి బెటాలియన్ లోని అధికారులు, సిబ్బందిచే యోగా కార్యక్రమాన్ని నిర్వహించి దానికి తగిన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమాండెంట్ పి. సత్యనారాయణ మాట్లాడుతూ పోలిస్ సిబ్బందికి యోగా యొక్క ప్రాముఖ్యత మరియు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని, యోగా మానసిక శారీరక ఆరోగ్య ప్రదాయిని అయినటువంటి యోగాను అనునిత్యం ప్రతి ఒక్కరు చేయాలని దీని వల్ల కలిగే లాభాలను వివరించారు. పోలీస్ సిబ్బంది వారి విధులలో తలమునకలై ఒత్తిడి జీవితాన్ని గడుపుతున్న తరుణంలో వారికి యోగా తరగతులు మానసిక సమతుల్యాన్ని అందించటంలో ఎంతో సహయపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్ కె.పి శరత్ కుమార్, ఆర్.ఐలు, ఆర్.యస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
యోగాతోనే ప్రశాంతత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES