- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : మండల వ్యవసాయదారులకు కారు మబ్బులు కనిపిస్తున్నాయే తప్ప వర్షం రాకపోవడంతో రైతన్నలు దిగాలుగా ఉన్నారు. వర్షాకాలం ప్రారంభంలో మూడు నాలుగు వర్షాలు భారీగా పడ్డాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో విత్తనాలు కూడా నాటారు. భారీగా పెట్టుబడులు పెట్టి వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. అయితే అప్పటి నుండి వర్షం మోహం చాటేసింది. ఇంకో నాలుగు రోజులు వర్షాలు పడకపోతే మొలకలు ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. వరుణుడా కరుణించవా అంటూ ఆకాశంకేసి రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
- Advertisement -