Saturday, May 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలులారీని ఢీకొట్టిన కారు..తల్లి కూతురు అక్కడికక్కడే మృతి

లారీని ఢీకొట్టిన కారు..తల్లి కూతురు అక్కడికక్కడే మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా కోదండపురం స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కియా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కర్నూల్ నుండి హైదరాబాద్ కి వెళ్తున్న కియా కారులో వెళ్తుండగా జాతీయ రహదారిపై రోడ్డుపై ఆగి ఉన్న లారీని కియా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి కూతురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగతా వారికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు హైవే సిబ్బంది తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -