- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా కోదండపురం స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కియా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కర్నూల్ నుండి హైదరాబాద్ కి వెళ్తున్న కియా కారులో వెళ్తుండగా జాతీయ రహదారిపై రోడ్డుపై ఆగి ఉన్న లారీని కియా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి కూతురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగతా వారికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు హైవే సిబ్బంది తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -