- Advertisement -
– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కేరాఫ్గా నిలిచిందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని దామోదర రాజనర్సింహ నివాసంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర అడ్లూరిని అభినందించి ఆశీర్వదించారు. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన, బీసీల రిజర్వేషన్ల పెంపు, మంత్రివర్గంలో నలుగురు ఎస్సీలకు స్థానం కల్పించడం, స్పీకర్గా అవకాశం ఇవ్వడం వంటి అంశాలను ఇద్దరు మంత్రులు గుర్తు చేసుకున్నారు.
- Advertisement -