Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖాతాలలో నగదు జమ చేయాలి..

ఖాతాలలో నగదు జమ చేయాలి..

- Advertisement -

సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి..
నవతెలంగాణ- తొ గుట 
: మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు ముగిసి దాదాపుగా నెల రోజులు గడుస్తున్నా రైతుల ఖాతాలలో పూర్తి స్థాయిలో నగదు జమ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. మండలంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కొనుగోలు కేంద్రాలకు దాదాపు నాలుగు మండలాల నుండి రైతులు తొగుట కొనుగోలు కేంద్రానిక ధాన్యాన్ని తీసుకు వచ్చారని అన్నారు. 789 మంది రైతుల నుండి 8387 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు ధాన్యాన్ని సేక రించి మార్కెట్ లకు తరలించామాని తెలిపారు. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం కోట ద్వారా 339 మంది రైతులకు దాదాపుగా రూ. 2 కోట్ల 70 లక్షల రూపాయలను జమ చేశరని చెప్పారు. రాష్ట్ర వాటా కోసం 450 మంది రైతుల నుండి 4529 క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు వివరించారు. అందుకు సుమారుగా రూ. 3 కోట్ల 28 లక్షల రూపా యల వరకు రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరో రెండు రోజులలో రోహిణి కార్తె ప్రారం భం అవుతున్నందున రైతులకు పెట్టుబడిగా ఈ నగదు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నా రు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మా  యాదగిరి, డైరెక్టర్ శ్రీధర్, సీఈవో గంగారెడ్డి, సిబ్బం ది చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -