- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటించారు. నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించిన ఆయన, కోఠిలోని సీబీఐ జోనల్ ఆఫీస్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీకి సంబంధించిన పెండింగ్ కేసుల పురోగతి, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు, వామనరావు దంపతుల హత్య కేసు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ ఆకస్మిక పర్యటన చర్చనీయాంశమైంది.
- Advertisement -



