- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
ఆషాడ మాసం పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రమైన తాడిచర్లలోని వేంకటేశ్వర ఆలయంలో మహిళలు గోరింటాకు సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు అందరికీ పండుగ వాతావరణం లో గోరింటాకు పెట్టుకున్నారు.గోరింటాకు చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుందని, ఒంట్లోని వేడిని తగ్గిస్తుందని, గోరింటాకు అనేది సాంప్రదాయకంగా, సౌందర్య సాధనంగా, అలాగే ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు కలిగి ఉందని గోరింటాకు జుట్టుకు బలాన్ని ఇవ్వడానికి, చుండ్రును తగ్గించడానికి ఉపయోగపడుతుందాని, ఆషాడ మాసం లో గోరింటాకు అలంకరణ తెలుగు వారి సంప్రదాయమని పలువురు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
- Advertisement -