Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రివర్గంలో వివేక్ కు చోటు కల్పించడంపై సంబరాలు.!

మంత్రివర్గంలో వివేక్ కు చోటు కల్పించడంపై సంబరాలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి వర్గంలో చోటు కల్పించడంపై మండలంలోని కొయ్యుర్ లో మలమహానాడు రాష్ట్ర కార్యదర్శి దేవి భూమయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,స్వీట్స్ పంచి,బాణసంచా పెల్సి ఆదివారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడారు మచ్చలేని,పేద,బడుగు,బలహీన వర్గాల నాయకుడు వివేక్ వెంకటస్వామి అన్నారు.మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు, కాకా ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకున్నట్టుగా తెలిపారు.మంత్రివర్గంలో గడ్డం వివేక్ వెంకటస్వామికి చోటు కల్పించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి,సిఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, ఎండి కలీముద్దీన్,గడ్డం ప్రేమ్ కుమార్,నవీన్, వేల్పుల శంకర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -