- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలైన పుల్లూరి బాలవ్వ ఈ నెల 5న మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆమె మృతి చెందే వరకు ఆమె పనులు ఆమెనే చేసుకునేదని, ఏ పనికైనా ఇతరులపై ఆధారపడకుండా చురుకుగా ఉండేదని అన్నారు. ఆమెకు కొద్దిపాటి జ్వరం వచ్చి ఈనెల 4న మృతి చెందడం జరిగిందన్నారు. శతాధిక వృద్ధురాలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -