నవతెలంగాణ-హైదరాబాద్ : నాలుగు రోజులుగా హుస్సేన్సాగర్లో జరిగిన జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ చాంపియన్షిప్ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. పలు విభాగాల్లో సత్తా చాటి పతకాలు కొల్లగొట్టిన తెలంగాణ.. ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి..ఆసియా రోయింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు సిపి సింగ్ దేవ్, రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు రాజ్యలక్షి, తెలంగాణ రోయింగ్ సంఘం అధ్యక్షుడు ఏపీ మిథున్ రెడ్డి సహా శాట్స్ ఉన్నతాధికారులతో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ‘తెలంగాణలో రోయింగ్ను జిల్లాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నాం. జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, శాట్స్ చక్కటి సహకారం అందించాయి. రోయింగ్లో తెలంగాణ హబ్గా మారనుందని’ ఏపీ మిథున్ రెడ్డి అన్నారు.