ప్రతిభగల ఆర్టిస్టులతో పాటు నూతన నటీ నటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా ‘చండీ దుర్గమా’.
ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు.
పూజా కార్యక్రమాలతో సోమవారం ఘనంగా ఈ సినిమా ప్రారంభమైంది. నటుడు అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. మరో నటుడు చిట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ,’అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలి’ అని తెలిపారు. ‘ఇటీవల అమ్మవారి నేపథ్యంగా సినిమాలు రూపొందడం లేదు. సౌందర్య ‘అమ్మోరు’, విజయశాంతి ‘చండీ’ సినిమా తర్వాత అమ్మవారి కథతో సినిమా రాలేదు. ఇప్పటి ట్రెండ్కు అనుగుణంగా ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా డార్క్ థీమ్లో సరికొత్త స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కో ప్రొడ్యూసర్ ఒలీ చెప్పిన ఒక పాయింట్ ఆధారంగా ఈ చిత్ర కథను రాశాను. ఇటీవల కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని డైరెక్టర్ మైనుఖాన్.ఎండీ చెప్పారు.
నిర్మాత జయశ్రీ వెల్ది మాట్లాడుతూ, ‘అమ్మవారి నేపథ్యంతో ఒక మంచి కథతో ఈ సినిమాను నిర్మించే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నా. మన తెలుగు ఆడియెన్స్ అమ్మవారి నేపథ్యంగా వచ్చిన చిత్రాలను ఎంతో ఆదరించారు. మా సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
సరికొత్తగా’చండీ దుర్గ మా’
- Advertisement -
- Advertisement -