ఇండియాకు అనుకూలంగా 14ఓట్లు, బంగ్లాదేశ్కు 2ఓట్లు
24 గంటల్లో ఏ విషయం తెలపండి: ఐసిసి
దుబాయ్: టి20 వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ ఇండియాలోనే మ్యాచులు ఆడాలా.. లేక వేరే చోట నిర్వహించాలా అనే అంశంపై ఐసిసి బుధవారం ఓటింగ్ నిర్వహించింది. ఇందులో ఇండియాలో బంగ్లా మ్యాచ్లు ఆడాల్సిందే అని 14 ఓట్లు, మరో చోట ఆడాలని 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్ ఇండియాలో మ్యాచులు ఆడాల్సిందే అని ఐసిసి తాజా ప్రకటనలో పేర్కొంది. దీంతో టి20 వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్ల వేదికల తరలింపు అభ్యర్ధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తిరస్కరించింది. మెగా టోర్నీలో ఆడేది, లేనిది ఏ విషయం 24 గంటల్లో తేల్చి చెప్పాలని ఐసిసి స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్.. ఇండియాలో మ్యాచులు ఆడాల్సిందే అని ఐసీసీ తేల్చి చెప్పింది.



